English | Telugu

`ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`: య‌శోధ‌ర్ మాజీ భార్య ట్రాప్‌లో వేద‌

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న స‌రికొత్త ప్రేమ‌క‌థ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ప్ర‌ధాన జంట‌గా న‌టించిన య‌శోధ‌ర్‌, వేద ఇద్ద‌రూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త వారే కావ‌డం.. డైరెక్ట‌ర్ ఎంచుకున్న నేప‌థ్యం.. క‌థాగ‌మ‌నం కొత్త‌గా వుండ‌టంతో ఈ సీరియ‌ల్‌ని బుల్లితెర‌ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. వేద‌గా డెబ్‌జానీమోడ‌క్‌, య‌శోధ‌ర్‌గా నిరంజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత హైలైట్‌గా నిల‌వ‌బోతోంది.

ఖుషీని కిడ్నాప్ చేసింద‌ని వేద కుటుంబాన్ని పోలీస్టేష‌న్‌కి లాగిన య‌శోధ‌ర్ త‌న మాజీ భార్య ఎంట్రీతో త‌ను త‌ప్పు చేశాన‌ని తెలుసుకుంటాడు. ఎలాగైనా వేద‌కు సారీ చెప్పాల‌నుకుంటాడు. ఇదే విష‌యాన్ని య‌ధ‌ర్ సోద‌రుడు వ‌సంత్ కూడా చెబుతాడు. నీ తొంద‌ర‌పాటు త‌నం వ‌ల్ల వేద జీవితం నాశ‌నం అయ్యేలా వుంద‌ని, అమెకు సారీ చెప్పమంటాడు. ఇందుకు య‌శోధ‌ర్ అంగీక‌రించి వేద‌కు సారీ చెప్ప‌డానికి రెడీ అవుతాడు. టెర్రాస్‌పై వేద వుంద‌ని తెలుసుకుని అక్క‌డికి వెళ్లిన య‌శోధ‌ర్ .. డాక్ట‌ర్ వేద‌కు సారీ చెప్పాడా? ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా వుంటే పాప‌ని అడ్డంపెట్టుకుని వేద‌ని ట్రాప్‌లో ప‌డేస్తుంది య‌శోధ‌ర్ మాజీ భార్య. వేద‌ని కావాల‌ని య‌శోధ‌ర్‌పై రెచ్చ‌గొట్టి అత‌నంటే త‌న‌కు ఇయిష్టం పెరిగేలా ప్లాన్ చేస్తారు. ఇంత‌కీ య‌శోధ‌ర్ మాజీ భార్య ప్లాన్ ఏంటీ? .. త‌న భ‌ర్త‌, బిజినెస్‌మెన్‌, య‌శోధ‌ర్ ప్ర‌త్య‌ర్థితో క‌లిసి ఏం ప్లాన్ చేసింది? .. వేద నిజంగానే వారి ట్రాప్‌లో ప‌డిపోయిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.